సుప్రీంకోర్టు ఎట్ల చెప్తే అట్ల : తెలంగాణ విద్యుత్ బకాయిలపై కేంద్ర మంత్రి జవాబు

సుప్రీంకోర్టు ఎట్ల చెప్తే అట్ల : తెలంగాణ  విద్యుత్ బకాయిలపై కేంద్ర మంత్రి జవాబు

న్యూఢిల్లీ, వెలుగు: ఆంధ్రప్రదేశ్ కు తెలంగాణ చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలకు సంబంధించిన కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉందని కేంద్ర విద్యుత్, పునరుత్పాదక శక్తి శాఖ మంత్రి ఆర్‌.కె. సింగ్ వెల్లడించారు. కోర్టు తీర్పు ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. మంగళవారం రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.

విద్యుత్ బకాయిల చెల్లింపుపై హైకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు రావడంతో.. ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ (ఎస్ఎల్పీ) దాఖలు చేసిందని,  కోర్టు తీర్పు ప్రకారం నిర్ణయం తీసుకుంటామని ఆయన సభలో సమాధానం చెప్పారు.