
ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమన్నారు ఎంపీ అసదుద్దీన్. తెలంగాణపై బీజేపీ ఫోకస్ పెట్టినా ఇక్కడ సీఎం కేసీఆర్ ఫుల్ జోష్ లో ఉన్నారని.. యూపీ ఫార్మూలా ఇక్కడ పని చేయదన్నారు. కాన్షీరాం సూర్తితో పనిచేస్తామన్నారు. గుజరాత్, రాజస్థాన్ లో పోటీ చేస్తామన్నారు. పోటీ చేయడం, ఓడించడం, గెలవడమే తమ పాలసీ అన్నారు. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ బలహీన పడిపోతుందన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉంటామన్నారు. మీడియాతో అసదుద్దీన్ చిట్ చాట్ చేశారు.
గులాంనబీ ఆజాద్ కి క్వార్టర్ పొడిగింపునకు మోడీ ఆఫీస్ నుండి ఆదేశాలు వెనక మతలబు ఏంటని ప్రశ్నించారు. ఆజాద్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టినా.. తమకు బీజేపీనే శత్రువన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఏపీ,తెలంగాణ, ఒరిస్సా మద్దతు తప్పని సరి అని అన్నారు. నియోజక వర్గాల పునర్విభజన మరో ఉద్యమానికి కారణం అవుతుందన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజక వర్గాల విభజన జరిగితే దక్షిణ భారత దేశం నష్టపోతుందన్నారు. దక్షిణాదిన జనాభా నియంత్రణ ఎక్కువని.. ఉత్తర భారత దేశంలో నియంత్రణ ఉండదన్నారు.