హైదరాబాద్, వెలుగు: పీసీసీ లీగల్ సెల్ చైర్మన్గా పొన్నం అశోక్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం గాంధీ భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు న్యాయవాదులు అటెండ్ అయ్యారు.
ఈ సందర్భంగా అశోక్ కు అభినందనలు తెలిపారు. ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి న్యాయవాదులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 9వ తేదీన లీగల్ సెల్ చైర్మన్గా అశోక్ గౌడ్ను నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కరీనంగర్, హైదరాబాద్లో న్యాయవాదిగా అశోక్ గౌడ్ మంచి గుర్తింపు పొందారు.