చెన్నై: సొంతగడ్డపై ఆసియా చాంపియన్స్ ట్రోఫీని ఘన విజయంతో ప్రారంభించిన ఇండియా మెన్స్ హాకీ టీమ్ అదే జోరు కొనసాగించలేకపోయింది. శుక్రవారం జరిగిన తమ రెండో మ్యాచ్లో ఇండియా 1–1తో జపాన్పై డ్రాతో గట్టెక్కింది. బలమైన డిఫెన్స్తో అదరగొట్టిన జపాన్కు 28వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ ద్వారా కెన్ నగయోషి గోల్ అందించాడు. మూడో క్వార్టర్ వరకూ ఆ జట్టు ఆధిక్యాన్ని కాపాడుకుంది.
అయితే, 43వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను సద్వినియోగం చేసుకుంటూ కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ గోల్ చేయడంతో ఇండియా 1–1తో స్కోరు సమం చేసింది. ఆ తర్వాత ఇరు జట్లూ మరో గోల్ కొట్టకపోవడంతో మ్యాచ్ డ్రా అయింది. దాంతో రెండు జట్లు చెరో పాయింట్ సాధించాయి. ఇతర మ్యాచ్ల్లో మలేసియా 5–-1తో చైనాను ఓడించగా, కొరియా, పాకిస్తాన్ మధ్య పోరు 1–1తో డ్రాగా ముగిసింది. ఆదివారం జరిగే తమ తర్వాతి మ్యాచ్లో మలేసియాతో ఇండియా పోటీ పడనుంది.