హిందువుల మనోభావాలను దెబ్బతీశాడంటూ అరెస్ట్

హిందువుల మనోభావాలను దెబ్బతీశాడంటూ అరెస్ట్

శివుడి వేషం వేసి హిందువుల మనోభావాలను దెబ్బతీశాడంటూ ఓ వ్యక్తిని అస్సాంలోని నాగావ్ పోలీసులు అరెస్ట్ చేశారు.  బిరించి బోరా అనే వ్యక్తి ఓ మహిళాతో కలిసి శివుడు, పార్వతి వేషధారణలతో వీధి నాటకం వేశాడు . ప్రధాని మోడీ ప్రభుత్వ హయాంలో ధరల పెరుగుదలకు నిరసనగా ఈ నాటకం వేసినట్టుగా  అతను పోలీసులకు తెలిపాడు. అయితే విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ వంటి  హిందూ సంఘాలు అతని నిరసనను ఖండించాయి.  రాజకీయ ప్రయోజనాల కోసం హిందు మతాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ బోరా పై  పోలీసులకు ఫిర్యాదు చేశాయి.  ఈ క్రమంలో అతన్ని అరెస్టు చేసి నాగోన్ సదర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.  అతన్ని రేపు కోర్టులో హాజరు పరచనున్నారు. ఇందులో మరో ఇద్దరి ప్రమేయం ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారికోసం దర్యాప్తు కొనసాగుతుంది.