ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున 4.45 గంటలకు చాందిని చౌక్ లోని లజ్ పత్ రాయ్ మార్కెట్లో  ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో 60 షాపులకు మంటలు అంటుకున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న 12 ఫైరింజన్లు మంటలార్పేశాయి. మంటల్లో షాపులు పూర్తిగా కాలి బుడిదయ్యాయి.  ప్రమాదానికి గల కారణాలను పోలీసులు తెలుసుకుంటున్నారు. భారీగా ఆస్తినష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.