విజయవాడలో టీడీపీ నేత పట్టాభిపై దాడి 

విజయవాడలో టీడీపీ నేత పట్టాభిపై దాడి 

విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి పై దాడి జరిగింది. కొద్దిసేపటి క్రితం తన ఇంటి నుండి ఆఫీసుకు బయలుదేరగా సుమారు 10 మంది దుండగులు అడ్డగించి దాడి చేసినట్లు సమాచారం. రాడ్డుతో దాడి చేయడంతో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. పట్టాభికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. దుండగులు ఆయన సెల్ ఫోన్ ను ధ్వంసం చేసినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం రాత్రి ఆయన ఇంట్లోనే కారుపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. తనను రాజకీయంగా ఎదుర్కోలేక బెదిరించేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పట్టాభి ఆరోపించారు. తాజాగా ఇవాళ మరోసారి దాడి జరగడం సంచలనం రేపింది. ఒకవైపు పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో అధికార పక్షాన్నితీవ్ర స్థాయిలో ఎండగట్టే పట్టాభిపై దాడి జరగడం కలకలం రేపుతోంది.  టీవీ ఛానెళ్ల చర్చల్లో అధికార వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద గొంతుతో మాట్లాడే పట్టాభిపై దాడి జరగడం ప్రత్యర్థుల పనేనా? లేక పాత కక్షలతో జరిగిందా ? అనేది తెలియాల్సి ఉంది. దాడి పట్ల తెలుగుదేశం  పార్టీ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

డ్రంకన్ డ్రైవ్ చేస్తే  మర్డర్ కేసులు పెట్టాలె

నా స్టైలే వేరు..మేం తలచుకుంటే అడ్రస్ లేకుండా చేస్తం

కుక్కకు ఘనంగా సీమంతం..అతిధులకు విందు భోజనం

3.79 కేజీల బంగారం.. 435 క్యారెట్ల వజ్రాల స్మగ్లింగ్