- ఆర్సీబీ ఫస్ట్ మ్యాచ్కు డుమ్మా
బెంగళూరు: ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా.. ఓ ఇంటివాడవుతున్నాడు. తన గాల్ఫ్రెండ్ హెటీ లీని తొందర్లోనే పెండ్లి చేసుకోబోతున్నాడు. దీంతో వచ్చే నెల 9న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆడే ఫస్ట్ మ్యాచ్లో అతను ఆడటం లేదని ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మైక్ హెస్సన్ వెల్లడించాడు. ‘లైఫ్లో మ్యారేజ్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి జంపా నిర్ణయాన్ని ఫ్రాంచైజీ గౌరవిస్తుంది. అతను టీమ్తో కలిసిన తర్వాత బలమైన ప్రభావం చూపిస్తాడని ఆశిస్తున్నాం’ అని హెస్సన్ పేర్కొన్నాడు. ఐపీఎల్–14 కోసం.. ఈ నెల 29 నుంచి ఆర్సీబీ ప్రిపరేషన్ క్యాంప్ మొదలుపెట్టనుంది. కాగా, లాస్ట్ ఇయర్ యూఏఈలో జరిగిన లీగ్లో కేవలం మూడు మ్యాచ్లే ఆడిన అతను రెండు వికెట్లే సాధించాడు.