Fire accident :  ఫస్ట్ ఫ్లోర్లో దొరికిన వెన్నెముక

Fire accident :  ఫస్ట్ ఫ్లోర్లో దొరికిన వెన్నెముక

సికింద్రాబాద్ ఫైర్ యాక్సిడెంట్ కేసులో గల్లంతైన ముగ్గురిలో ఒకరి డెడ్ బాడీని అధికారులు గుర్తించారు. ఫోమ్ ను ఉపయోగించడంతో బిల్డింగ్ వేడి కాస్త తగ్గడంతో లోపలికి వెళ్లిన ఫైర్ సిబ్బంది ఫస్ట్ ఫ్లోర్లో ఓ మృతదేహానికి సంబంధించి వెన్నెముకను గుర్తించారు. దాన్ని కిందకు తీసుకొచ్చిన పోలీసులు గాంధీ హాస్పిటల్కు తరలించారు.  మిగిలిన ఇద్దరి మృతదేహాల కోసం ఫైర్, క్లూస్ టీం, డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు కొనసాగిస్తున్నారు. మిగిలిన ఫ్లోర్లలో వాళ్ల డెడ్ బాడీ దొరికే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

అగ్నిప్రమాదం జరిగిన సమయంలో స్టోర్స్ లో పనిచేస్తున్న వసీం, జునైద్, జహీర్ అందులో చిక్కుకుపోయారు. బీహార్కు చెందిన ఈ ముగ్గురు యువకులు ఏడాదిగా స్టోర్స్లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మంటల్లో చిక్కుకుపోయిన వసీం, జునైద్, జహీర్ లను రక్షించేందుకు రెస్క్యూ టీం అన్ని ప్రయత్నాలు చేసింది. అయినా ఫలితం లేకుండా పోయింది.