ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు నోటీసులతో కూడిన బెయిల్

ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు నోటీసులతో కూడిన బెయిల్

రన్నింగ్ లో క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ రాసే అవకాశమివ్వాలంటూ ఆందోళనకు దిగిన ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులపై పోలీసులు కేసు నమోదుచేశారు. డీజీపీ ఆఫీస్, ప్రగతి భవన్, అసెంబ్లీ ముట్టడికిప్రయత్నించిన 16 మందితో పాటు శాసనసభ పరిసరాల్లో నిరసన చేపట్టిన 12 మందిపై కేసు ఫైల్ చేశారు. 38 మందిపై 341, 147, 149, 352, 353 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారందరికీ సీఆర్పీసీ 41ఏ నోటీసులు ఇచ్చారు. అనంతరం స్టేషన్ బెయిల్ మంజూరు చేసి పంపారు.

శాంతియుతంగా ఆందోళన చేస్తున్న తమపై కేసులు పెడుతున్నారని అభ్యర్థుల ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా లాంగ్ జంప్  4 మీటర్లు చేశారని వాపోయారు. తెలంగాణలో 2014, 2018 నోటిఫికేషన్ లలో లాంగ్ జంప్ 3.8 మీటర్లు మాత్రమే ఉందన్న అభ్యర్థులు.. తమ సమస్యను రిక్రూట్మెంట్ బోర్డు పరిష్కరించాలని కోరారు. ఈ ఘటనలో మొత్తం 38మందిపై పోలీసులు కేసులు నమోదు చేయగా... వారిపై సెక్షన్ 353 తో పాటు పలు క్రిమినల్ కేసులను ఫైల్ చేశారు.