ఆలయాల్లో జంతు బలి నిషేధం: త్రిపుర హైకోర్టు 

ఆలయాల్లో జంతు బలి నిషేధం: త్రిపుర హైకోర్టు 

కొన్ని పండుగల సందర్భంగా ఆలయాల్లో జంతువులను బలిచ్చి భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. అయితే దీనిపై  త్రిపుర హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. హిందూ దేవాలయాల్లో జంతు బలిని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని శక్తిపీఠమైన మాతా త్రిపురేశ్వరి దేవాలయంతోపాటు ఇతర దేవాలయాల్లోనూ ఇకపై జంతువులను బలి ఇవ్వకూడదని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ సంజయ్‌కరోల్‌, జస్టిస్‌ అరిందం లోథ్‌తో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. రాష్ట్రంలోని త్రిపురేశ్వరి దేవాలయంలో జంతువులను బలి ఇవ్వడం రాజుల కాలం నుంచి కొనసాగుతున్న ఆచారం. దీన్ని వ్యతిరేకిస్తూ సుభాష్‌ భట్టాచార్య అనే న్యాయవాది హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం తీర్పునిచ్చింది.