పొగాకు ఉత్పత్తులు అమ్మొద్దు: హర్షవర్థన్​

పొగాకు ఉత్పత్తులు అమ్మొద్దు: హర్షవర్థన్​

పొగాకు ప్రొడక్ట్స్​ అమ్మొద్దని… పబ్లిక్​ ప్లేసుల్లో ఉమ్మివేయడాన్ని బ్యాన్ చేయాలని​ రాష్ట్రాలు, యూనియన్ టెరిటీరీలను సెంట్రల్​ హెల్త్​ మినిస్టర్​ హర్షవర్థన్​ కోరారు. కరోనా ఇన్ఫెక్షన్​ వ్యాప్తి చెందకుండా రాజస్థాన్​, జార్ఖండ్​ ప్రభుత్వాలు వీటిని ఇప్పటికే బ్యాన్​ చేశాయని, మిగిలిన రాష్ట్రాలు కూడా వాటిని అనుసరించాలని హర్షవర్థన్ కోరారు. దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాల హెల్త్​ మినిస్టర్లకు ఆయన లెటర్లు రాశారు. పొగాకు వాడేవాళ్లు పబ్లిక్​ స్థలాల్లో ఉమ్మేస్తుంటారని…దీంతో కరోనా వైరస్​లాంటివి వ్యాప్తిచెందడానికి అవకాశామున్నందువల్ల వాటి సేల్స్​ను ఆపేయాలని ఆయన ఆ లేఖలో కోరారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజా ఆరోగ్యానికి పొగకు వాడకం పెద్ద ప్రమాదమన్నారు. పొగరాని పొగాకు ప్రొడక్ట్స్​ వాడొద్దంటూ ఇండియన్​ కౌన్సిల్​ ఆఫ్​ మెడికల్​ రిసెర్చ్​ (ICMR) ఇప్పటికే జనానికి విజ్ఞప్తి చేసింది.