కేరళలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు స్పాట్

కేరళలో ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు స్పాట్

కేరళలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. కాసర్ గోడ్ లోని మంజేశ్వరం దగ్గర కారును ఢీకొట్టింది అంబులెన్స్. ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. పలువురుకి గాయాలయ్యాయి. ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను వెలికితీశారు. 

తర్వాత క్రేన్ సాయంతో బోల్తా పడిన అంబులెన్స్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమని ప్రాథమికంగా నిర్దారించారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

కొల్లూరులోని మూకాంబికా ఆలయం నుండి తిరిగి వస్తున్న ముగ్గురు వ్యక్తులు వేగంగా వస్తున్న అంబులెన్స్ ను ఢీకొట్టారు.   మృతులను  త్రిసూర్‌లోని ఇరింజలకుడాకు చెందిన పి శివకుమార్ (54), అతని కుమారులు శరత్ ఎస్ మీనన్ (23), సౌరవ్ (15)గా గుర్తించారు.  ఈ ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్ కాలికి తీవ్రగాయాలయ్యాయి.