రాష్ట్ర రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా బీజేపీ నిరసనలు

రాష్ట్ర రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా బీజేపీ నిరసనలు

బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న రాష్ట్ర రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఇవాళ ఆందోళనలు చేయాలని పార్టీ శ్రేణులకు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కిసాన్ మోర్చా ఇన్ చార్జ్ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. అన్ని జిల్లా కేంద్రాల్లో.. ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

2018 ఎన్నికల సమయంలో రైతులకు రుణమాఫీ చేస్తానని ఇచ్చిన హామీని కేసీఆర్ ప్రభుత్వం మరిచిపోయిందని, వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి కారణంగా రాష్ట్రంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 

రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు

ఇవాళ బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా  ధర్నాలు, నిరసన కార్యక్రమాలను ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు చేపట్టనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతు ధర్నాలు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే అన్ని జిల్లా కేంద్రాల్లో రైతు ధర్నాలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ వెంటనే చేయాలని డిమాండ్ చేశారు. ధరణి సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు.