
హైదరాబాద్, వెలుగు: కరీంనగర్ కోర్టులో ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు సంబంధించిన కేసు విచారణకు కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్కు హైకోర్టులో ఊరట లభించింది. ఎన్నికల నియమావళికి సంబంధించి కరీంనగర్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు మినహాయింపునిస్తూ హైకోర్టు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తూ విలేకరుల సమావేశం నిర్వహించారంటూ కరీంనగర్ తహసీల్దార్ వి.రమేశ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీన్ని కొట్టివేయాలని కోరుతూ బండి సంజయ్ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ కె. లక్ష్మణ్ సోమవారం విచారించి పోలీసులకు నోటీసులు జారీచేశారు. తదుపరి ఉత్తర్వులు జారీచేసేదాకా కోర్టులో హాజరు నుంచి బండి సంజయ్కు మినహాయింపునిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.