ప్రధాని నరేంద్ర మోడీతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ భేటీ అయ్యారు. ఇవాళ ఢిల్లీలో తన ఫ్యామిలీతో కలిసిన బండి సంజయ్ మోడీని మర్యాదపూర్వకంగా కలిశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శగా నియమించిన తర్వాత తొలిసారి ప్రధాని మోడీని కలిశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ ను మోడీ అభినందించారు. తెలంగాణలో బీజేపీ విధివిధానాలపై, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై బండి సంజయ్ తో చర్చించారు.
ALSO READ:ఎకరం రూ.72 కోట్లు.. హైదరాబాద్ రియల్ బూం
రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం మరింత కష్టపడాలని బండి సంజయ్ కు సూచించారు మోడి. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగిన మోడీ కాసేపు బండి సంజయ్ కుమారులతో మాట్లాడారు.
ఆగస్టు 4న బీజేపీ కేంద్ర కార్యాలయంలో బండి సంజయ్ బీజేపీ జాతీయ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకోనున్నారు. కాసేపు పార్టీ నేతలతో సమావేశమై.. మధ్యాహ్నం హైదరాబాద్ కు బయల్దేరనున్నారు.