హైదరాబాద్ శివారులోని కోకాపేటని యోపాలిస్ భూముల వేలం సర్కార్ కు కాసుల వర్షం కురిపిస్తోంది. గతేడాది కంటే ఈ సారి వేలంలోరికార్డు స్థాయి ధరకు ప్లాట్లు అమ్ముడుపోతున్నాయి. అత్యధికంగా ఎకరం 72 కోట్లు పలికగా... అతి తక్కువగా 51.75 కోట్లు అమ్ముడుపోయింది. మొత్తంగా నాలు ప్లాట్లకు రూ. 1532.5 కోట్లు పలికింది.
ALSO READ:ప్రధాని మోడీని కలిసిన బండి సంజయ్...
కోకాపేటలో ఉన్న 45.33 ఎకరాల్లో ఉన్న 7 ప్లాట్లకు హెచ్ఎండీ వేలం నిర్వహించింది. ఇంకా మూడు ప్లాట్లను వేలం వేయనుంది. ఈ వేలం ద్వారా దాదాపు రూ. 2500 కోట్లు రాబట్టాలని అధికారులు అంచనా వేస్తున్నారు. 2021లో ఇదే ఏరియాలో వేలం నిర్వహించగా కనిష్టంగా ఎకరా రూ. 31 కోట్లు ,గరిష్టంగా రూ. 60 కోట్లు పలికింది.