నీట్ పేపర్ లీకేజీ వివాదంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తొలిసారి స్పందించారు. నీట్పేపర్ లీకేజీ విషయంలో కేంద్రం వేగంగా చర్యలు చేపట్టింది. విద్యార్థులు నష్ట పోవద్దని 48 రోజుల్లో మళ్లీ ఎగ్జామ్ పెట్టామన్నారు. ఢిల్లీలో దీక్ష చేస్తామంటే కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ కూడా ఇచ్చిందన్నారు. విద్యార్థులు ముసుగులో కొందరు సంఘ విద్రోహ శక్తులు చేరాయని ఆరోపించారు. దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని అన్నారు. ఆందోళనల్లో 118 మంది పోలీసులు గాయపడ్డారు. అయినప్పటికీ పోలీసులు సంయమనం పాటించారని చెప్పుకొచ్చారు బండి సంజయ్.
ఆందోళన లకు సంబంధించిన న్యూస్ స్ర్పెడ్ చేస్తున్న 480 పాకిస్తాన్ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేశామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆందోళనల్లో గాయపడినవారిలో ఎవరూ విద్యార్థులు లేరని చెప్పారు. ఆందోళన సందర్భంగా ఆర్టికల్ 370 ప్రస్తావన వచ్చింది. . నీట్ కు ఆ ఆర్టికల్ ను సంబంధం ఏంటని ప్రశ్నించారు మంత్రి.
విద్యార్థులకోసమే ప్రధాని మోదీ నిత్యం ఆలోచిస్తున్నారని అన్నారు బండి సంజయ్, నీట్ లీకేజీపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా క్షమాపణాలు చెప్పారని .. విచారణ జరపాలని సీబీఐ కూడా లేఖ రాశారని అన్నారు.
పేపర్ లీకేజీ వివాదంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ స్పందించారు. కాంగ్రెస్ పాలనలో టెన్త్ తెలుగు, హిందీ పేపర్లు కూడా లీకయ్యాయి. గ్రూప్ 1 లో అక్రమాలు జరిగాయి.. 4 లక్షల మంది నిరుద్యోగుల భవిషత్తు నాశనమైంది.. వారెందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు మంత్రి. గ్లోబరీనా గురించి మాట్లాడుతున్న సీఎం...ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు సూత్రధారాలైన వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయడం లే దని అన్నారు కేంద్రమంత్రి బండిసంజయ్.
