
టీ20 వరల్డ్ కప్లో మరో కీలక పోరు జరుగుతోంది. సెమీస్ బెర్తే లక్ష్యంగా టీమిండియా బంగ్లాతో తలపడుతుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మరోవైపు వరుసగా రెండు విజయాల తర్వాత సౌతాఫ్రికా చేతిలో ఓడిన టీమిండియా బంగ్లాపై భారీ విజయాన్ని సాధించాలని బరిలోకి దిగింది. గెలిచి సెమీస్ బెర్తుకు మరింత చేరువవ్వాలని చూస్తోంది.
తుది జట్లు
ఇండియా: కేఎల్ రాహుల్, రోహిత్ (కెప్టెన్), కోహ్లీ, సూర్య, కార్తీక్ , అక్షర్, పాండ్యా, అశ్విన్, భువనేశ్వర్, షమీ, అర్ష్దీప్.
బంగ్లాదేశ్: నజ్ముల్ శాంటో, లిటన్, షకీబ్ (కెప్టెన్) అఫిఫ్, నురుల్ (కీపర్), మొసాదెక్, యాసిర్, తస్కిన్, ముస్తాఫిజుర్, హసన్ మహ్మూద్.షోరిఫుల్ ఇస్లామ్