- భూ వివాదంలో బెదిరించినందుకు రెండు క్రిమినల్ కేసులు
హైదరాబాద్: నగర మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిలింనగర్ లో భూవివాదం విషయంలో నిఖిల్ రెడ్డి అనే వ్యక్తిపై ఎంఐఎం పార్టీకి చెందిన మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్పై పోలీసుల ఎదుటే బెదిరింపులకు దిగారు. నచ్చ చెప్పేందుకు ప్రయత్నించిన పోలీసు ఇన్స్ పెక్టర్ పైనే దురుసుగా ప్రవర్తిచారు. అడ్డుకున్న పోలీసులపై మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ దుర్భాషలాడుతూ చిందులు తొక్కారు. దూరం నుంచి వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది. బాధితుడి ఫిర్యాదు మేరకు ఒక కేసు నమోదు చేసిన పోలీసులు.. విధులకు ఆటంకం కలిగించారంటూ ఎస్ఐ రవిరాజ్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేశారు.