13 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్.. రూ. 32 లక్షల విలువైన కూపన్లు స్వాధీనం

13 మంది పేకాట రాయుళ్లు అరెస్ట్.. రూ. 32 లక్షల విలువైన కూపన్లు స్వాధీనం

స్టార్ హోటల్ లో పేకాట శిబిరం.. ఆన్ లైన్ లో బుకింగ్స్.. ఆఫ్ లైన్ లో ప్లేయింగ్... పేకాట రాయుళ్లు దర్జాగా స్టార్ హోటల్స్ లో కూర్చొని పేకాట ఆడుతున్నారు.. హైదరాబాద్ లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 4 లోని రాడిసన్ హోటల్ లో పేకాట శిబిరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 13 మంది పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారివద్ద నుంచి రూ. 32 లక్షల విలువైన కూపన్లుతోపాటు కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు. 
 
పట్టుబడిన వారిలో కొంతమంది మహిళలు కూడా ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని తెలిపారు.