బ్యాంకులను బురిడీ కొట్టించిన ముఠా అరెస్టు

బ్యాంకులను బురిడీ కొట్టించిన ముఠా అరెస్టు

రాచకొండలో బ్యాంకులను బురిడీ కొట్టించిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ పేర్లు సృష్టించి వారి పేర్ల మీద లోన్స్ తీసుకొని ఎగ్గొడుతున్న  వారిలో ఐదుగురు నిందితులను మల్కాజ్ గిరి ఎస్ఓటి పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. నకిలీ కంపెనీ సృష్టించి క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్ పేరుతో నిందితులు రూ. 2.50 కోట్ల రుణం తీసుకున్నారు. వరంగల్ నుండి అమాయకులను తీసుకొచ్చి ఆధార్ కార్డ్స్, ఫొటోస్ పెట్టి దుండగులు లోన్లు తీసుకున్నారు. నిందితుల నుంచి 93 క్రెడిట్ డెబిట్ కార్డ్స్ , 28 పాన్ కార్డు, 54 ఆధార్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

లగ్జరీ లైఫ్ కు అలవాటు పడిన నిందితులు... పూణే,గోవా, పంజాబ్, కేరళ రాష్ట్రాల్లో జల్సా చేసేవారని తెలుస్తోంది. ఖరీదైన బట్టలు, షూస్, వాచ్, సెల్ ఫోన్స్ లతో లైఫ్ ను ఎంజాయ్ చేస్తూ.. రీసెంట్ గా 100 కిలోల బరువు తగ్గి గుర్తు పట్టకుండా స్లిమ్ గా మారాడు. ఇక ఇటీవల జరిగిన లోన్ మోసం కేసులో బ్యాంక్ అధికారుల ఫిర్యాదుపై కేసు నమోదు చేసి నిందితులను పట్టుకున్నట్టు ఎస్ఓటి పోలీసులు తెలిపారు.

ఇంటీరియర్ డెకరేషన్ పేరుతో మోసం...

క్రెడిట్, డెబిట్ కార్డుల కేసులో ఐదుగురిలో నలుగురిని అరెస్టు చేశామని, ఒక నిందితుడు చనిపోయాడని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. వారిలో బోడ శ్రీకాంత్ ప్రధాన నిందితుడని, బానోతు సుమన్, నగేశ్, గౌతమ్ లు మిగతా నిందితులని చెప్పారు. రెండేళ్ళ ఇంటీరియర్ డెకరేషన్ పేరుతో కంపెనీని సృష్టించి మోసం చేస్తూ వస్తున్నారని సీపీ అన్నారు. బానోతు సుమన్, భిక్షపతిల పేరు మీద శ్రీకాంత్ ఇంటీరియర్ డెకరేషన్ ప్రారంభించాడన్న సీపీ... రెండు, మూడు నెలల పాటు జీతాలు వేయడం చేశాడని చెప్పారు. ఆ తరువాత క్రెడిట్ కార్డులు తీసుకొని నగదును విత్ డ్రా చేశారన్నారు.