
- బతుకమ్మ సంబురాలు ఘనంగా చేయాలి
- ఈనెల 25 నుంచి షురు: సీఎస్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 25వ తేదీ నుంచి ప్రారంభంకానున్న బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. సోమవారం బీఆర్కే భవన్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో మాట్లాడారు. అక్టోబర్ 3 వరకు బతుకమ్మ పండుగ ఉంటుందని చెప్పారు. సద్దుల బతుకమ్మ జరిగే అక్టోబర్ 3న ట్యాంక్బండ్ వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బతుకమ్మ ఘాట్, ట్యాంక్బండ్, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, రోడ్ల రిపేర్ పనులు వెంటనే చేపట్టాలన్నారు. ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాలన్నింటినీ విద్యుత్ దీపాలతో అలంకరించాలని సూచించారు. నిమజ్జనం చేసే ప్రాంతాల్లో ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.