స్టేడియంలోకి మీడియాకు అనుమతి లేదు: బీసీసీఐ

స్టేడియంలోకి మీడియాకు అనుమతి లేదు: బీసీసీఐ

ఐపీఎల్ మ్యాచ్ లకు ప్రేక్షకులనే కాదు…మీడియాను కూడా అనుమతించడం లేదు. అబుదాబిలోని షేక్ జాయెద్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మొదటి మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ క్రమంలో బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. స్టేడియంలోకి మీడియాకు అనుమతి లేదని ప్రకటించింది. నెట్ ప్రాక్టీస్ సమయంలో ఆటగాళ్లను కవర్ చేయడానికి, ప్రెస్ మీట్లకు మీడియాకు అనుమతి ఉంటుంది. అయితే.. కరోనా కారణంగా భౌతికదూరం పాటించాల్సి రావడంతో… మీడియాను అనుమతించడం లేదని బీసీసీఐ చెప్పింది.

మ్యాచ్ లకు ముందు ఫ్రాంచైజీలు ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టాల్సిన అవసరం లేదని… మ్యాచ్ లు ముగిసిన తర్వాత వర్చువల్ మీడియా సమావేశాలు ఉంటాయని బీసీసీఐ తెలిపింది. అప్ డేట్స్ ను ప్రెస్ నోట్స్ ద్వారా కూడా అందిస్తామని చెప్పింది.