యూఏఈలో మిగతా ఐపీఎల్ మ్యాచ్ లు

యూఏఈలో మిగతా ఐపీఎల్ మ్యాచ్ లు

అర్థాంతరంగా ఆగిపోయిన ఐపీఎల్ పై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. ఐపీఎల్ రెండో షెడ్యూల్ నిర్వహణపై చర్చించిన బీసీసీఐ.. సీజన్ లో మిగిలిన మ్యాచులను దుబాయిలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్-అక్టోబల్ మధ్య మ్యాచ్ లు నిర్వహించాలని ప్లాన్ చేసింది. మరోవైపు ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి విదేశీ క్రికెట్ బోర్డులతోనూ చర్చించనుంది. IPL కు విదేశీ ఆటగాళ్ల అందుబాటు అంశంపై వారితో చర్చలు జరుపనుంది. టీ 20 ప్రపంచకప్ నిర్వహణకు టైమ్ పొడిగించాలని ఐసీసీని కోరనున్నట్లు తెలుస్తోంది. జూన్ 1న జరగనున్న ఐసీసీ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.