ఈడెన్ గార్డెన్ లో డే నైట్ టెస్టు మ్యాచ్ కు రంగం సిద్ధమవుతోంది. నవంబర్ 22 న బంగ్లాదేశ్ తో భారత్ రెండో టెస్టు ఆడనుంది.ఈడెన్ లో జరిగే రెండో టెస్టు డే నైట్ నిర్వహించాలని బీసీసీఐ తమను కోరిందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బిసిబి) తెలిపింది.
అయితే బీసీబీ ఇంకా తమ నిర్ణయం చెప్పలేదు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఓకే చెబితే మొట్టమొదటి డే నైట్ మ్యాచ్ ఈడెన్ గార్డెన్ లో జరుగుతుంది. డే నైట్ టెస్టు మ్యాచ్ లకు భారత్ కెప్టెన్ కోహ్లీ కూడా సిద్ధంగా ఉన్నాడని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ చెప్పారు.భారతో తో మొదటి టెస్ట్ నవంబర్ 14 న ఇండోర్లో ప్రారంభం కానుంది, రెండో టెస్ట్ నవంబర్ 22 నుండి ఈడెన్ గార్డెన్స్లో ఆడనుంది.