దాడికి ప్రతి దాడి: కొట్టుకున్న తృణముల్, బీజేపీ కార్యకర్తలు

దాడికి ప్రతి దాడి: కొట్టుకున్న తృణముల్, బీజేపీ కార్యకర్తలు

బెంగాల్ లో బీజేపీ, తృణమూల్ కార్యకర్తల మధ్య మరోసారి వార్ జరిగింది. బీజేపీ ఎంపీ దిలీప్ ఘోష్ లేక్ టౌన్ లో చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా.. తృణమూల్ కార్యకర్తలు దాడికి దిగారు. దీంతో బీజేపీ శ్రేణులు ఎదురుదాడికి దిగారు. పోలీసులు వచ్చి రెండు వర్గాలను చెదరగొట్టారు. బీజేపీ ఎంపీ  దిలీప్ ఘోష్ మార్నింగ్ వాక్ తర్వాత లేట్ టౌన్ లోని ఓ ప్రాంతంలో స్థానికులతో కలిసి మాట్లాడుతుండగా ఈ ఘటన జరిగింది.