అర్బన్ కరోనా హాట్‌స్పాట్స్​గా బెంగళూరు, హైదరాబాద్

అర్బన్ కరోనా హాట్‌స్పాట్స్​గా బెంగళూరు, హైదరాబాద్

న్యూఢిల్లీ: దేశంలో కొత్త కరోనా హాట్‌స్పాట్స్‌గా బెంగళూరు, హైదరాబాద్, పూణేలు నిలిచాయి. తొమ్మిది అర్బన్ సెంటర్స్‌, 5 మిలియన్‌కు పైగా జనాభా కలిగిన ఈ సిటీస్‌లో కరోనా కేసుల సంఖ్య ఉధృతంగా పెరుగుతోంది. ఇంతకు ముందు ఈ లిస్ట్‌లో ఉన్న ముంబై, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్‌ల్లో వైరస్ ప్రభావం కొంతమేర తగ్గడం మంచి పరిణామంగా చెప్పొచ్చు. హయ్యస్ట్‌ కరోనా ఇన్ఫెక్షన్స్ రేట్‌ ఉన్న సిటీగా బెంగళూరు ఉంది. ఆ సిటీలో గత నాలుగు వారాలుగా రోజుకు యావరేజ్‌గా 12.9% వేగంతో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. మరణాలు కూడా సగటున ప్రతి రోజూ 8.9 శాతం చొప్పున నమోదవుతున్నాయి.

హైదరాబాద్ విషయానికి వస్తే.. మిలియన్‌కు 2,061 కేసులు నమోదవుతున్నాయి. అలాగే మిలియన్‌కు 36 మంది చనిపోతున్నారు. భాగ్యనగరంలో కేసుల శాతం 7.8 శాతం ఉంది. బెంగళూరు, హైదరాబాద్ తర్వాత కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న లిస్ట్‌లో పూణే, సూరత్, కోల్‌కతా. ఢిల్లీ, చెన్నై. ముంబై, అహ్మదాబాద్ ఉన్నాయి. గత నాలుగు వారాల కరోనా డేటాను ఆధారంగా తీసుకొని ఈ విశ్లేషణ చేశారని తెలిసింది.