
Bengaluru Tenant: బెంగళూరు ఐటీ రంగానికి పెట్టింది పేరు. ఒకప్పుడు ఈ నగరానికి చాలా మంది తమ ఉపాధి కోసం, మెుదటి సారి ఉద్యోగం సంపాదించటం కోసం వెళ్లేవారు. అయితే ప్రస్తుతం ఆ నగరానికి రద్దీ తగ్గుతున్నప్పటికీ.. అక్కడ ఇంటి యజమానులు చేసే పనులు మాత్రం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఒకపక్క భారీ అద్దెలు, అడ్వాన్సులు డిమాండ్ చేసే ఓనర్లు చివరికి ఖాళీ చేసేటప్పుడు అద్దెకు ఉన్న వారికి చుక్కలు చూపిస్తున్న ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
బెంగళూరులో ఐఐటీ గ్రాడ్యుయేట్ అయిన శ్రవణ్ టిక్కొ తన ఇంటి యజమానితో ఎదురైన అనుభవాన్ని పంచుకున్నాడు. సర్జాబూర్ రోజ్జులో ఒక 2BHKలో దాదాపు రెండేళ్లు అద్దెకు ఉన్నట్లు చెప్పాడు. అయితే అందులో చేరే ముందు తన యజమానికి తాను లక్షన్నర రూపాయలు అడ్వాన్స్ రూపంలో చెల్లించినట్లు వెల్లడించాడు. కానీ చివరికి ఇల్లు ఖాళీ చేసినప్పుడు ఇంటి రిపేర్లకు రూ.25వేలు, పెయింటింగ్ ఖర్చులకు రూ.55వేలు యజమాని తీసుకున్నట్లు వెల్లడించాడు. అయితే తాను అద్దెకు ఉన్న రోజుల్లో కనీసం ఒక్కసారి కూడా తనతో యజమాని మాట్లాడలేదని విద్యార్థి చెప్పాడు. బిల్డింగ్ మేనేజరు ద్వారానే తనతో సంప్రదింపులు జరిపినట్లు చెప్పాడు.
తాను డిపాజిట్ చేసిన మెుత్తంలో చివరికి రూ.68వేలు మాత్రమే తిరిగి వెనక్కి చెల్లించినట్లు విద్యార్థి వెళ్లడించాడు. ఇక లిఫ్టు వాడుకున్నందుకు కూడా రూ.2వేలు వసూలు చేసినట్లు చెప్పాడు. వివరాలు అడిగితే చేతితో రాసిన ఒక చీటీ తనకు ఇచ్చారని, అందులో వేరువేరు ఛార్జీలను ఇంటి యజమాని రాసినట్లు చెప్పాడు. బెంగళూరులో ఇంటి యజమానులతో చాలా జాగ్రత్తగా ఉండాలని, అసలే భారీగా ఉన్న అద్దెలకు తోడు ఇలా ఇష్టమెుచ్చినట్లు చివరికి డిపాజిట్ ఎగ్గొట్టేవారు చాలా మంది ఉంటారని సోషల్ మీడియాలో కొందరు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం బెంగళూరుకు వచ్చే ప్రజలకు అక్కడి ఇంటి యజమానులు పెద్ద ముప్పుగా మారుతున్నారని రీథింక్ సిస్టమ్స్ వ్యవస్థాపకులు శ్రవణ్ టిక్కొ పేర్కొన్నారు. ఒకసారి తాను ఉంటున్న ఇంట్లో కిటికీ అద్దం పగిలినప్పుడు దానిని రిపేర్ చేయించి అద్దెలో ఆ మెుత్తాన్ని తగ్గించి బిల్ వాట్సాప్ చేశానని, దానికి యజమాని ససేమిరా అంటూ తనతోనే బిల్లు కట్టించినప్పుడే ఖాళీ చేసే రోజు అంత సులువుగా ఆమె విడిచిపెట్టదని అర్థం చేసుకున్నట్లు చెప్పాడు. చాలా మంది బెంగళూరు యజమానులు ఇలా అద్దెకు వచ్చేవారిని ఇబ్బంది పెట్టడంతో పాటు వారి అడ్వాన్స్ డబ్బులను అనవరసమైన ఖర్చులు చూపి మింగేస్తున్నారని సోషల్ మీడియాలో చాలా మంది బాధితులు చెబుతున్నారు.