విషాదం.. చెట్టు, కారు డోర్ మధ్యలో ఇరుక్కుని మ‌హిళ మృతి

విషాదం.. చెట్టు, కారు డోర్ మధ్యలో ఇరుక్కుని మ‌హిళ మృతి

బెంగళూరులోని సదాశివనగర్‌లో విషాదం జ‌రిగింది. కారు డోర్, చెట్టు‌ మధ్య ఇరుక్కుని నందిని రావ్‌(45) అనే మహిళ మృతి చెందింది. రివర్స్‌ గేర్‌లో చెట్టు కింద నిలిపిన కారు వెనకకి రావటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తన ఇంటి ముందు పార్క్ చేసిన కారు వద్దకు వచ్చిన నందిని రావు.. కారు ముందు డోర్ తెరిచింది. రివర్స్‌ గేర్‌లో నిలిపిన విషయం మరిచి పోయి అందులో ఎక్కబోయింది. దాంతో అనుకోకుండా కారు వెనక్కి కదిలింది. ఆ కారు ప‌క్క‌నే చెట్టు ఉండ‌డంతో కారు డోర్‌కు చెట్టుకి మధ్య నందిని రావు ఇరుక్కుపోయింది. కారుతో పాటే వెన‌క్కు వచ్చిన నందినీ.. చెట్టుకు బలంగా గుద్దుకున్నారు తలకు బలమైన గాయమ‌వ‌డంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచిం‌ది. గ‌తంలోనే కారు పార్కింగ్‌కు అడ్డుగా ఉన్న ఆ చెట్టును తొలగించాలని ఆమె పలుసార్లు చెప్పినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు ఆ ఏరియా ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.