
బెంగళూరులోని సదాశివనగర్లో విషాదం జరిగింది. కారు డోర్, చెట్టు మధ్య ఇరుక్కుని నందిని రావ్(45) అనే మహిళ మృతి చెందింది. రివర్స్ గేర్లో చెట్టు కింద నిలిపిన కారు వెనకకి రావటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తన ఇంటి ముందు పార్క్ చేసిన కారు వద్దకు వచ్చిన నందిని రావు.. కారు ముందు డోర్ తెరిచింది. రివర్స్ గేర్లో నిలిపిన విషయం మరిచి పోయి అందులో ఎక్కబోయింది. దాంతో అనుకోకుండా కారు వెనక్కి కదిలింది. ఆ కారు పక్కనే చెట్టు ఉండడంతో కారు డోర్కు చెట్టుకి మధ్య నందిని రావు ఇరుక్కుపోయింది. కారుతో పాటే వెనక్కు వచ్చిన నందినీ.. చెట్టుకు బలంగా గుద్దుకున్నారు తలకు బలమైన గాయమవడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. గతంలోనే కారు పార్కింగ్కు అడ్డుగా ఉన్న ఆ చెట్టును తొలగించాలని ఆమె పలుసార్లు చెప్పినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు ఆ ఏరియా ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.