మాదాపూర్ సైబర్ టవర్ వద్ద బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. సిగ్నల్ జంప్ చేసిన కారు బులెట్ బైక్ ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు. అక్కడే ఉన్న పోలీసులు స్థానిక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. ప్రమాదానికి కారణమైన బెంజ్ కారు డ్రైవర్ కాశి విశ్వనాథ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మాదాపూర్ పోలీసుల వివరాల ప్రకారం.. బెంజ్ కారులో వెళ్తున్న టెకీ విశ్వనాధ్ అతని మిత్రుడు జూబ్లీహిల్స్లోని పబ్ లో మద్యం సేవించి తాగిన మత్తులో డ్రైవింగ్ చేస్తూ కూకట్ పల్లి వైపు వెళ్తున్నారు. సైబర్ టవర్ సిగ్నల్ దగ్గర సిగ్నల్ జంప్ చేసి బైక్ ను ఢీ కొట్టారు. ఈ ఘటనలో బైక్ పై ఉన్న గౌతమ్ దేవ్(33) మృతి చెందగా.. ఆయన భార్యకు గాయాలయ్యాయి. టెకీ విశ్వనాథ్ అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు.