బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘భగవంత్ కేసరి’. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కీలకపాత్ర పోషిస్తోంది. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, గణేష్ పాటకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది.
తాజాగా మరో పాటకు ముహూర్తం పెట్టారు మేకర్స్. ‘ఉయ్యాలో ఉయ్యాలా’ అంటూ సాగే రెండో సాంగ్ను అక్టోబర్ 4న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో బాలకృష్ణ నది ఒడ్డున కూర్చుని పాపతో సరదాగా కబుర్లు చెబుతున్నట్టు వెనుక నుంచి కనిపిస్తుంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.