TRS ధర్నాలను పోలీసులు ఎందుకు అడ్డుకోరు

 TRS ధర్నాలను పోలీసులు ఎందుకు అడ్డుకోరు

పోలీసుల తీరుపై కాంగ్రెస్ నేత  భట్టి విక్రమార్క  ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార TRS పార్టీకి ఒక న్యాయం, విపక్షాలకు మరో న్యాయమా? అంటూ పోలీసుల తీరును తప్పుబట్టారు. TRS ధర్నాలను పోలీసులు ఎందుకు అడ్డుకోవట్లేదని ప్రశ్నించారు. ఇవాళ(సోమవారం) సీఎం కేసీఆర్ దత్తత గ్రామం ఎర్రవల్లిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు. అయితే ఆ కార్యక్రమం కోసం ఎర్రవల్లికి వెళ్లకుండా రేవంత్ ఇంటి  దగ్గర  భారీగా పోలీసులను మోహరించారు. రేవంత్ ను హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పాటు రచ్చబండ కోసం ఎర్రవల్లికి వస్తున్న కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్నారు.  దీనిపై  ఆగ్రహం వ్యక్తం చేశారు భట్టి.

పోలీస్ నిర్బంధాలతో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు భట్టి విక్రమార్క. రైతుల సమస్యలపై, ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేస్తే అడ్డుకుంటారా? అని ప్రశ్నించారు.ప్రభుత్వమే భావప్రకటన స్వేచ్ఛను హరించడం అప్రజాస్వామికమని విమర్శించారు. TRS నిరంకుశ పాలనను ప్రజలు గుర్తించాలన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ఇందిరాపార్క్  దగ్గర ధర్నాచౌక్ లో కేసీఆర్ ధర్నా చేయలేదా.. అని ప్రశ్నించారు.

 

మరిన్ని వార్తల కోసం..

జనవరి 1 నుంచి జీఎస్టీలో మార్పులు