
యాదాద్రి, వెలుగు: జిల్లా కేంద్రమైన భువనగిరిలో పైప్లైన్చేంజ్చేస్తున్నందున రెండు రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేస్తున్నామని మిషన్ భగీరథ ఆఫీసర్ పి. కరుణాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం నీటి సరఫరా జరుగుతున్న డీఐ 350 ఎంఎం పైప్లైన్ను గురు, శుక్రవారం చేంజ్చేస్తున్నామని చెప్పారు.
ఈ పనుల కారణంగా 19, 20 తేదీల్లో ఆత్మకూర్ మండలంలోని 26 గ్రామాలు, మోటకొండూరు మండలంలోని 10, భువనగిరి మండలంలో 5, వలిగొండ మండలంలో 3 గ్రామాలకు గోదావరి నుంచి వచ్చే మంచినీటి సరఫరా నిలిపివేస్తున్నామని ఆయన చెప్పారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.