
సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కొమ్మినేని బెయిల్ పిటిషన్ విచారించిన జస్టిస్ పి.కె.మివ్రా ధర్మాసనం.. ఆయనను విడుదల చేయాలని ఆదేశించింది. విశ్లేషకుడి వ్యాఖ్యలతో కొమ్మినేనికి సంబంధం లేదని ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. కొమ్మినేనని విడుదల చేయాలని.. విడుదల నిబంధనలు ట్రయల్ కోర్టు చూసుకుంటుందని సూచించింది.
మరోసారి అమరావతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయవద్దని కొమ్మినేనికి ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం సూచించింది. భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. కింది కోర్టు విధించిన షరతులకు లోబడే బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. 70 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తిని ఎలా అరెస్టు చేస్తారని ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.
కొమ్మినేని పనిచేస్తున్న ఒక న్యూస్ ఛానల్లో ఆయన ఆధ్వర్యంలో నడిచే ఒక డిబేట్లో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు శుక్రవారం (జూన్ 13) సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.