బిగ్ బాస్ నిర్వాహకుల షాకింగ్ డెసిషన్.. ఇకపై అవన్నీ బంద్

బిగ్ బాస్ నిర్వాహకుల షాకింగ్ డెసిషన్.. ఇకపై అవన్నీ బంద్

బిగ్ బాస్ సీజన్ 7(Bigg boss season7) ముగింపు వేడుకల్లో జరిగిన వివాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ చేసిన రచ్చ గవర్నమెంట్ ప్రాపర్టీ డామేజీ జరిగింది. పెద్ద ఎత్తున న్యూసెన్స్ క్రియేట్ అయ్యింది. ఈ కారణంగా విన్నర్ పల్లవి ప్రశాంత్ జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. దీంతో బిగ్ బాస్ షోపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. షో బ్యాన్ చేయాలంటూ విమర్శలు తలెత్తాయి. అంతేకాదు కాదు.. బిగ్ బాస్ షో నిర్వాహకులకు కూడా పోలీసులు నోటీసులు పంపించారు. 

దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు షాకింగ్ డెసిషన్ తీసుకోనున్నారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. బిగ్ బాస్ విన్నింగ్ అనంతరం ఎలాంటి ర్యాలీలు తీయకూడదని కండీషన్ పెట్టనున్నారట. ఈమేరకు పక్కా అగ్రిమెంట్ కూడా చేసుకోనున్నారట. విన్నర్ బయటకు వచ్చాక సైలెంట్ గా వెళ్లిపోవాలని, గ్యాదరింగులు, ర్యాలీలు చేయకూడని అగ్రిమెంట్ లో రాసుకోనున్నారట. ఈ కారణంగా రోడ్లపై న్యూసెన్స్ తగ్గే అవకాశం ఉందని వారు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

ఇక బిగ్ బాస్ విషయానికి వస్తే.. ఇటీవలే సీజన్ 7 ముగించుకున్న ఈ షో.. త్వరలోనే ఓటీటీ సెకండ్ సీజన్ కోసం సిద్ధమవుతోందని సమాచారం. 2024 ఫిబ్రవరిలో బిగ్ బిన్ నాన్ స్టాప్ సీజన్ 2 మొదలుకానుందట. ఇందుకోసం సెట్ వర్క్ కూడా ఇప్పటికే మొదలైందట. మరి కొత్త సీజన్ కోసం ఎవరెవరు కంటెస్టెంట్స్ గా రానున్నారు? హోస్ట్ గా మళ్లీ నాగార్జునని ఉంటారా? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.