బిట్​ బ్యాంక్​: కందూరి చోడులు

బిట్​ బ్యాంక్​: కందూరి చోడులు
  •     తెలంగాణలోని నల్లగొండ, మహబూబ్​నగర్, ఖమ్మం జిల్లాలోని నేలకొండ ప్రాంతాన్ని కందూరి చోడులు పాలించారు. 
  •     కందూరి చోడుల వంశానికి చెందిన ముఖ్య కవులు గోకర్ణుడు, ఉదయాదిత్యుడు. 
  •     కందూరి చోడులను తొలుత ఏరువ చోడులని పిలిచేవారు. 
  •     నల్లగొండ దుర్గానికి ఏరువ సింహాసనం, ఏరువ పీఠమని పేరు.
  •     ఏరువచోడులు పాలించిన ప్రాంతం ఏరువనాడు.
  •     ఏరువచోడుల మొదటి రాజు ఏరువ మొదటి భీమదేవచోడుడు. 
  •     ఏరువచోడులు కల్యాణీ చాళుక్యులు, కాకతీయులకు సామంతులుగా ఉన్నారు. 
  •     ఏరువచోడులకు కందూరిచోడులు అనే పేరు కల్యాణీ చాళుక్య చక్రవర్తి ఆరో విక్రమాదిత్యుడు నుంచి కందూరునాడును పొందినప్పటి నుంచి వచ్చింది. 
  •     నల్లగొండ జిల్లాలోని పానగల్లు ఏరువ మొదటి భీమదేవచోడుని రాజధాని. 
  •     వైదంబులకు రేనాటి చోడులకు జరిగిన యుద్ధాల్లో ఓడి ఏరువ సీమకు వచ్చిన కందూరి చోడులు రాజ్యస్థాపన చేశారు. 
  •     చోళులతో జరిగిన యుద్ధాల్లో సోమేశ్వరునికి ఏరువ భీముడి కుమారుడు ఏరువ మొదటి తొండయభీముడు తోడ్పడ్డాడు. 
  •     కల్యాణీ చాళుక్య త్రిభువనమల్ల ఆరో విక్రమాదిత్యునికి యుద్ధాల్లో తోడ్పడి కందూరు నాడును ఏరువ రెండో భీమదేవ చోడుడు పొందినవాడు. 
  •     కాకతీయ మొదటి ప్రోలరాజుకు, రెండో బేతరాజుకు సమకాలీనుడు అయిన కందూరిచోడ రాజు రెండో తొండయచోళమహారాజు. 
  •     వర్ధమానపురం (నేటి నాగర్​కర్నూలు తాలుకాలోని వడ్డెమాను) రాజధానిగా కందూరునాడును ఉదయనుడు పాలించాడు. 
  •     నల్గగొండ జిల్లాలోని పానగల్లు సమీపంలోని ఉదయ సముద్రాన్ని కందూరిచోడ రాజు ఉదయనుడు తవ్వించాడు. 
  •     సంస్కృతంలో ఉదయాదిత్యాలంకారం అనే లక్షణ గ్రంథాన్ని కందూరిచోడ రాజు ఉదయనుడు రచించాడు. 
  •     తుమ్మేటి గ్రామంలో భీమనది అనే కాలువను, మండగంటి గ్రామంలో గోకర్ణమనే కాలువను ఉదయనుడి కుమారులు నాలుగో భీముడు, రెండో గోకర్ణుడు తవ్వించారు. 
  •     కందూరిచోడుల్లో చివరివాడు రామనాథ చోడుడు. 
  •     కందూరి చోడులు మూసీ నది మీద నమిలె వద్ద ఆనకట్ట నిర్మించి కాలువలు తవ్వించారు. 
  •     పెద్దదేవులపల్లి, ఆకారం చెరువు, గోకారం కాలువ చెరువు, కొప్పోలు చెరువు, శౌలిగౌరారం చెరువు, భీమసముద్రం వంటి అనేక గొలుసుకట్టు చెరువులను కందూరిచోడులు నిర్మించారు. 
  •     కందూరిచోడుల కాలంలో గ్రామాల్లో ఉండే 18 రకాలైన వృత్తుల వారిని అష్టాదశ వర్ణాలు అని పిలిచేవారు. 
  •     కందూరిచోడులు వైదిక మతస్తులు. 
  •     కందూరిచోడుల కాలంలో ప్రజలు ఎక్కువగా శివుడిని ఆరాధించేవారు. 
  •     నల్లగొండ జిల్లాలోని పచ్చల సోమేశ్వరాలయం, ఛాయాసోమేశ్వరాలయం, భువనగిరిలోని సోమేశ్వరాలయం, మామిళ్లపల్లిలోని నరసింహాలయం, కూడలి సంగమేశ్వరాలయాన్ని కందూరుచోడులు నిర్మించారు. 
  •     కందూరుచోడులు నిర్మించిన కోటలు అనుముల, పానగల్లు, వాడపల్లి, వర్ధమానపురం, కందూరు, సిరికొండ, ఉండ్రుగొండ, ఉర్లుగొండ. 
  •     కందూరుచోడులు 40 శాసనాలను వేయించారు. 
  •     కందూరుచోడుల శాసనాలు తెలుగు, కన్నడ లిపుల్లో ఉండేవి. 
  •     కందూరుచోడుల కాలంలో వచ్చిన తొలి పద్య శాసనం అనుముల శాసనం. 
  •     ఆగామోతుకూరు శాసనంలో అచ్చమైన తెలుగు భాష కనిపిస్తుంది.
  •     గోకర్ణచందస్సును మొదటి గోకర్ణుడు రచించాడు. 
  •     మొదటి గోకర్ణునికి సమకాలీనుడైన శాసనకవి త్రిపురాంతకుడు.