బిట్​ బ్యాంక్​.. తెలంగాణ సరిహద్దులు

 బిట్​ బ్యాంక్​.. తెలంగాణ సరిహద్దులు
  •     ఆంధ్రా, హైదరాబాద్​ రాష్ట్రాల విలీనం కోసం పెద్ద మనుషుల ఒప్పందం 1956 ఢిల్లీ వేదికగా జరిగింది. 
  •     స్వాతంత్ర్యం రాక ముందు భాషా ప్రాతిపదికన ఏర్పడిన మొదటి రాష్ట్రం ఒరిస్సా.
  •     దక్షిణాపథం అంటే తుంగభద్ర, నర్మదా నదుల మధ్య గల ప్రాంతం.
  •     అస్మక జనపదం గోదావరి నదీ పరీవాహక  ప్రాంతంలో విలసిల్లింది. 
  •     ప్రాదన్యపురం నగరాన్ని రాజధానిగా చేసుకొని అస్మక జనపదం విలసిల్లింది. 
  •     హైదరాబాద్​ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత జిల్లాలు నల్లగొండ, మెదక్​, వరంగల్​, నిజామాబాద్​, మహబూబ్​నగర్, కరీంనగర్​, ఆదిలాబాద్, హైదరాబాద్​. 
  •     ఆంధ్రప్రదేశ్​ విభజన కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్​ మినిస్టర్స్​కు చెర్మన్​ ఎ.కె.ఆంటోని. 
  •     ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర విభజనపై అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం 2009 డిసెంబర్ లో శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది.
  •     2009, డిసెంబర్ 9న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు మొదటిసారిగా ప్రకటించినప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం. 
  •     ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లును ఆంధ్రప్రదేశ్​ శాసనసభ అభిప్రాయం కోసం 2013, సెప్టెంబర్ 11న పంపించారు. 
  •     తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్​కుమార్​ షిండే. 
  •     తెలంగాణ బిల్లును రాష్ట్రపతి ఆమోదించిన  తేదీ 2014, మార్చి 1.
  •     తెలంగాణలోని జిల్లాల పునర్విభజన తెలంగాణ జిల్లాల ఏర్పాటు చట్టం–1974 ప్రకారం జరిగింది. 
  •     తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగంలోని అధికరణ 3 ప్రకారం జరిగింది. 
  •     తెలంగాణ రాష్ట్ర అధికారిక పండుగలు బతుకమ్మ, బోనాలు, మేడారం జాతర.
  •     తెలంగాణ రాష్ట్రంలో మొత్తం శాసనసభ స్థానాల సంఖ్య 119.
  •     తెలంగాణ రాష్ట్ర చిత్రపట ఆకారం సమద్విబాహు త్రిభుజం.
  •     హైదరాబాద్​ సంస్థానంలో పర్షియా భాష స్థానంలో అధికార భాషగా ఉర్దూను 1884లో ప్రవేశపెట్టారు.
  •     ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు గ్రామాలను 2014, జులై 17న ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రంలో కలిపారు. 
  •     ఖమ్మం జిల్లాలోని 327 గ్రామాలను ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేశారు. 
  •     ఖమ్మం జిల్లాలోని నాలుగు మండలాలను పూర్తిగా ఆంధ్రప్రదేశ్​లో విలీనం చేశారు. 
  •     ఖమ్మం జిల్లాలోని రెండు మండలాలను పాక్షికంగా ఆంధ్రప్రదేశ్​లో విలీనం చేశారు. 
  •     ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్​లో విలీనం చేయడం ద్వారా 2.76 లక్షల హెక్టార్ల వైశాల్యం కలిగిన భూభాగాన్ని తెలంగాణ కోల్పోయింది. 
  •     ఖమ్మం జిల్లాలోని ఏడు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్​లో విలీనం చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రం 2,17,157 హెక్టార్ల  అటవీ వైశాల్యం కోల్పోయింది.
  •     తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద పట్టణం హైదరాబాద్​.
  •     తెలంగాణ కశ్మీర్​గా ఆదిలాబాద్​ జిల్లాను పిలుస్తారు.
  •     జైలు మ్యూజియాన్ని తొలిసారిగా సంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేశారు. 
  •     గేట్​ వే ఆఫ్​ తెలంగాణ అని సూర్యాపేట జిల్లాను పిలుస్తారు.
  •     పూర్వం వికారాబాద్​ జిల్లాను గంగవరం అని పిలిచేవారు.
  •     ఎండుమిర్చి, పత్తి కొనుగోలు కోసం ఏర్పాటు చేసిన ఆసియాలోనే అతిపెద్ద వ్యవసాయంమార్కెట్​ అయిన ఎనుమాముల మార్కెట్ వరంగల్​ జిల్లాలో ఉంది.
  •     సింగరేణి కాలరీస్​ ప్రధాన కార్యాలయం కొత్తగూడెం జిల్లాలో ఉంది.
  •     గార్ల ప్రాంతంలో ప్రతి సంవత్సరం దసరా రోజున జాతీయ జెండాను ఎగురవేస్తారు. 
  •     తెలంగాణ రాష్ట్రంతో సరిహద్దు పంచుకొనే రాష్ట్రాలు నాలుగు.
  •     తెలంగాణలోని అతి తక్కువ జిల్లాలతో ఛత్తీసగఢ్​ రాష్ట్రం సరిహద్దును పంచుకుంటుంది.
  •     అత్యధిక జిల్లాలతో మహారాష్ట్ర సరిహద్దును పంచుకుంటోంది.
  •     ఛత్తీస్ గఢ్​తో సరిహద్దు పంచుకునే తెలంగాణ జిల్లాలు కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి.
  •     తెలంగాణ రాష్ట్రంలో భూపరివేష్టిత జిల్లాల సంఖ్య 15.
  •     తెలంగాణ రాష్ట్రంలో అంతర్ రాష్ట్ర సరిహద్దు కలిగిన మొత్తం జిల్లాల సంఖ్య 18.
  •     మహారాష్ట్ర సరిహద్దును పంచుకొనే జిల్లాల సంఖ్య 7. 
  •     కర్ణాటకతో సరిహద్దును పంచుకునే తెలంగాణ రాష్ట్ర జిల్లాలు 5.
  •     ఆంధ్రప్రదేశ్​తో సరిహద్దు పంచుకునే తెలంగాణ జిల్లాల సంఖ్య 7. 
  •     ఛత్తీస్​గఢ్​తో సరిహద్దును పంచుకునే జిల్లాల సంఖ్య 3. 
  •     సోలామైన్ అనే ప్రాంతం దక్కన్​ పీఠభూమిలో అతి ఎత్తయినది. అయినా ఇది తెలంగాణలోని జనగాం జిల్లాలో ఉంది.