బీజేపీ మూడో జాబితా..చెన్నై సౌత్ నుంచి తమిళి సై

బీజేపీ మూడో జాబితా..చెన్నై సౌత్ నుంచి తమిళి సై


లోక్ సభ ఎన్నికలకు బీజేపీ మూడో జాబితా రిలీజ్ చేసింది.   తమిళనాడులోని 9 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.  చెన్నై సౌత్ నుంచి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై పోటీ చేస్తున్నారు. 

బీజేపీ ఫస్ట్ లిస్టులో 194 మంది అభ్యర్థులను ప్రకటించగా.. రెండో జాబితాలో 72 మందిని ప్రకటించింది. ఇపుడు మూడో జాబితాలో 9 మందిని ప్రకటించింది. దీంతో మొత్తం ఇప్పటి వరకు బీజేపీ 275 మందిని ప్రకటించింది. 

9మందితో మూడో జాబితా

  • చెన్నై సౌత్ -  తమిళి సై సౌందర రాజన్
  • కోయంబత్తూరు -అన్నామలై
  • చెన్నై సెంట్రల్- వినోజ్  పి. సెల్వన్
  •  వెల్లూర్ - ఏసి. శన్ముగమ్
  • క్రిష్ణగిరి -సి.నరసింహన్
  • నీలగిరి - ఎల్. మురుగన్
  • పెరంబలూరు - పారివేందర్
  • తూత్తుకూడి - నైనార్ నాగేంద్రన్
  • కన్యాకుమారి - రాధాకృష్ణన్
 

ALSO READ :- Realme NARZO లుక్, ఫీచర్స్ అదుర్స్..ఎర్లీ బర్డ్ సేల్స్ లోనే రికార్డు బ్రేక్ చేసింది..