బిజెపి అభ్యర్థి రాహుల్ నర్వేకర్ మహారాష్ట్ర శాసనసభ స్పీకర్గా ఎన్నికయ్యారు, అతనికి మద్దతుగా మొత్తం 164 ఓట్లు పడ్డాయి. వ్యతిరేకంగా 107 మంది ఓటేశారు. దీంతో స్పీకర్ గా రాహుల్ నర్వేకర్ ఎన్నికయ్యారు. ఈ ఓటింగ్ కు ఎస్పీ, ఎంఐఎం పార్టీలు దూరంగా ఉన్నాయి. అనంతరం స్పీకర్ గా నర్వేకర్ బాధ్యతలు స్వీకరించారు. నర్వేకర్ బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో శాసన సభ "జై భవానీ, జై శివాజీ", "జై శ్రీ రామ్", "భారత్ మాతా కీ జై, వందేమాతరం" అనే నినాదాలతో మార్మోగింది.
#WATCH | BJP MLA Rahul Narwekar takes charge as the Speaker of Maharashtra Assembly amid chants of "Jai Bhavani, Jai Shivaji", "Jai Sri Ram", "Bharat Mata ki Jai" and "Vande Mataram".
— ANI (@ANI) July 3, 2022
(Source: Maharashtra Assembly) pic.twitter.com/oQ1qn2wdcp
అంతకుముందు శివసేనకు సీఎం ఏక్ నాథ్ షిండే ఝలక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి షిండే నేతృత్వంలోని శివసేన నేతలు.. మహారాష్ట్ర అసెంబ్లీలోని శివసేన శాసనసభాపక్ష కార్యాలయానికి సీల్ వేశారు. ఈ మేరకు ఆఫీసు తలుపు మీద నోటీసు అంటించారు. శివసేన శాసనసభాపక్షం సూచనల మేరకు కార్యాలయాన్ని మూసివేస్తున్నామని నోటీసులో మరాఠీలో పేర్కొన్నారు.
అటు స్పీకర్ ఎన్నిక కోసం ఉదయం 11 గంటలకు మహారాష్ట్ర అసెంబ్లీ తొలిరోజు సమావేశమైంది. స్పీకర్ పదవి కోసం బీజేపీ తరపున రాహుల్ నర్వేకర్.., శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ తరపున రాజన్ సాల్వీ బరిలో నిలిచారు. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు అసెంబ్లీకి హాజరయ్యారు. శివసేన తిరుగుబాటు నేత, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, బీజేపీతో కలవడంతో..రాహుల్ సర్వేకర్ గెలుపు లాంఛనమైంది.
Maharashtra | MLAs of Eknath Shinde-faction come out of Hotel Trident hotel in Mumbai. Together, they will arrive at the State Assembly where the election for the Speaker post will be held today. pic.twitter.com/JFstQueS1q
— ANI (@ANI) July 3, 2022
సోమవారం మహా సీఎం షిండే బలపరీక్ష ఎదుర్కోనున్నారు. 39 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు, 11 మంది స్వతంత్రులు.. శనివారం గోవా నుంచి ముంబయి చేరుకున్నారు. వీరంతా షిండేకు మద్దతుగా నిలవనున్నారు. వీరితో పాటు..షిండేకు అనుకూలంగా బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఓటేయనున్నారు.