రాష్ట్రంలో గో రక్షక్ చట్టాన్ని అమలు చేస్తారా లేదా .?

రాష్ట్రంలో గో రక్షక్ చట్టాన్ని అమలు చేస్తారా లేదా .?

రాష్ట్రంలో గో రక్షక్ చట్టాన్ని అమలు చేస్తారా లేదా ? అని సీఎంను ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. కర్మన్ ఘాట్ లోని ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. చెక్ పోస్టులు ఏర్పాటు చేసి గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవాలన్నారు. గోవులను అక్రమంగా తరలిస్తున్నవారిని అడ్డుకోవాల్సిన పోలీసులు గో రక్షకుల్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. గోరక్షకులపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని ఫైర్ అయ్యారు. సీఎం కేసీఆర్ హోమాలు, యజ్ఞాలు చేస్తే సరిపోదని విమర్శించారు. గోవులను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎదుటి వాళ్లు నాశనం అవ్వాలంటూ కేసీఆర్ ఫామ్ హౌస్ లో యాంత్రిక తాంత్రిక పూజలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారుల వత్తిడి వల్లే పని చేయలేకపోతున్నామని పోలీసులు బాధపడుతున్నారని తెలిపారు.