లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో డీప్ ఫేక్ వీడియోల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇటీవల, హెూంమంత్రి అమిత్ షా వీడియోను ట్యాంపరింగ్ చేస్తూ డీప్ ఫేక్ వీడియో తయారు చేయబడింది, ఇప్పుడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ డీప్ ఫేక్ వీడియోకు సంబంధించిన కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఓ నిందితుడిపై కేసు నమోదు చేసిన యూపీ STF పోలీసులు గురువారం ( మే 2) ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (యుపి ఎస్టిఎఫ్) అమితాబ్ యష్ తెలిపారు.
నిందితుడిపై నోయిడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లు 468 (మోసం చేసినందుకు ఫోర్జరీ), 505 (2) (ప్రజా దుర్వినియోగానికి సంబంధించిన స్టేట్మెంట్) మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని నిబంధనల ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
माननीय मुख्यमंत्री उत्तर प्रदेश का एआई जनरेटेड डीप फेक वीडियो सोशल मीडिया प्लेटफार्म पर अपलोड कर भ्रामक तथ्य फ़ैलाने वाले अभियुक्त श्याम गुप्ता को दिनांक 02.05.2024 को @uppstf नोएडा यूनिट द्वारा गिरफ्तार किया गया है। सोशल मीडिया पर भ्रामक सूचना प्रसारित करना दंडनीय अपराध है और… pic.twitter.com/VwJW1D48ix
— UP POLICE (@Uppolice) May 2, 2024
"మే 1న, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ను ఆర్టిఫియల్ ఇంటిలిజెన్స్ ద్వారా (AI-) రూపొందించిన డీప్ఫేక్ వీడియో X హ్యాండిల్ ID '@shyamguptarpswa' ఖాతాలో పోస్ట్కాగా అది వైరల్ అయింది. దీనిలో దేశ ప్రజలను తప్పు దోవపట్టించే విధంగా ఉన్నాయని ... దేశ వ్యతిరేక అంశాలు బలపడుతున్నాయని ఏడీజీపీ తెలిపారు. ఈ నకిలీ వీడియోలో బీజేపీని తొలగించండి, దేశాన్ని రక్షించండి. అని ఉంది. ఈ విషయమై యూపీ ఎస్టీఎఫ్ సైబర్ క్రైమ్ కింద కేసు నమోదు చేసినట్లు నోయిడా ఏసీపీ తెలిపారు. అలాగే, ఈ డీప్ ఫేక్ వీడియోను ఎక్స్లో పోస్ట్ చేసిన నోయిడాకు చెందిన శ్యామ్ గుప్తాను అరెస్టు చేశారు. వీడియోకు సంబంధించిన దర్యాప్తులో AI సహాయంతో ఈ డీప్ ఫేక్ వీడియో రూపొందించినట్లు తేలింది. నిందితుడు శ్యామ్ కిషోర్ గుప్తా, నోయిడా గౌతమ్ బుద్ధ నగర్ బరోలా నివాసి, నోయిడాలోని స్థానిక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయి.