హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఢిల్లీ మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, జాగృతి అధ్యక్షురాలు కవిత సహా 23 మందికి న్యాయస్థానం క్లీన్ చిట్ ఇచ్చింది. నిందితులపై మోపిన అభియోగాలు నిరాధారమైనవని పేర్కొంటూ సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేసింది. ఈ సందర్భంగా సీబీఐపై న్యాయస్థానం మండిపడింది. సీబీఐ కేసు నమోదు చేసిన తీరు, దర్యాప్తు విధానాన్ని న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది.
ALSO READ : ఇది కరెక్ట్ కాదు కేటీఆర్.. బ్లేమ్ చేయడం మానుకోవాలి
సీబీఐను కోర్టు ఏమన్నాదంటే..?
- ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీబీఐ కథనం ఊహాజనితమని, చట్టబద్ధంగా సమర్థనీయం కాదు
- సాక్ష్యాల కంటే ముందస్తుగా ఊహించిన అంచనాలతో కేసు నమోదు
- సీబీఐ ఒక కథనాన్ని రూపొందించడానికి ప్రయత్నించింది.
- ఈ కేసులో సీబీఐ సౌత్ గ్రూప్ అనే పదాన్ని ఏకపక్షంగా సృష్టించింది. దీనికి ఎలాంటి ఆధారాలు లేవు.
- సీబీఐ ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక సీన్ క్రియేట్ చేసింది. కానీ చట్టం అటువంటి చర్యలను అనుమతించదు.
- ఈ కేసులో సీబీఐ పేర్కొన్న 12 శాతం హోల్సేల్ మార్జిన్ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి.
- ముందుగా ఊహించిన కుట్ర కథనానికి సరిపోయేలా వ్యక్తులపై ఆరోపణలు
- ఈ కేసులో ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ విధానాన్ని అమలు చేస్తూనే సాధారణ అధికారిక విధులను నిర్వర్తిస్తున్నారనే వాస్తవాన్ని సీబీఐ దర్యాప్తు అధికారి పూర్తిగా విస్మరించారు.
- కేసు విచారణలో సీబీఐ అనుసరించిన పద్ధతి నేర దర్యాప్తును అతిగా చేరుకోవడానికి ఒక సాధనంగా మార్చే ప్రమాదం ఉంది.
- నేరం వల్ల వచ్చే ఆదాయం ఉందనే ముందస్తు అంచనాతో దర్యాప్తు అధికారులు ముందుకు సాగారు.
- నియంత్రణ, ప్రయోజనం లేదా నేరపూరిత ఉద్దేశ్యం (మెన్స్ రియా) ఆధారాలు లేకుండా సాధారణ ఆర్థిక లావాదేవీలను నేరంగా పరిగణించడానికి ఏజెన్సీ ప్రయత్నించింది.
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం సీబీఐను పావుగా ఉపయోగించారు
- సాక్ష్యాధారాలు లేకుండా ప్రభుత్వ ఉద్యోగిని ఇరికించినందుకు కేసు దర్యాప్తు అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు సిఫార్సు చేసింది.
- ఈ కేసు న్యాయ పరిశీలనను పూర్తిగా తట్టుకోలేకపోయింది. పూర్తిగా అపఖ్యాతి పాలైంది.
