NTR 31: ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పిచ్చెక్కించే న్యూస్.. ప్రశాంత్ మూవీపై సూపర్ అప్డేట్

NTR 31: ఎన్టీఆర్ ఫ్యాన్స్కి పిచ్చెక్కించే న్యూస్.. ప్రశాంత్ మూవీపై సూపర్ అప్డేట్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr) కు వరల్డ్ వైడ్ గా ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆర్ఆర్ఆర్ హిట్ తరువాత ఆ క్రేజ్ నెక్స్ట్ లెవల్ కు చేరుకుంది. అందుకే ఆయన సినిమాలపై భారీ హైప్ క్రియేట్ అవుతోంది. అందుకు తగ్గట్టుగానే తన నెక్స్ట్ సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్. అందులో భాగంగా వస్తున్న మూవీనే NTR31. ఈ సినిమాను కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు.

దీంతో.. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. నార్మల్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. నిజం చెప్పాలంటే..  ఎన్టీఆర్ వేరే ఏ సినిమాకు లేని రేంజ్ లో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అవుతోంది. ఇక అనౌన్స్మెంట్ రోజు విడుదల చేసిన పోస్టర్ ఆ అంచనాలని ఆకాశానికెత్తేసింది. అప్పటినుండి ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలువుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.తాజాగా ఈ సినిమా నుండి క్రేజీ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అదేంటంటే.. ఈ సినిమా 2024 సెప్టెంబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుందట. ఇప్పటికే ఈ సినిమా కు సంబందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. ప్రశాంత్ సలార్ పార్ట్ 2 ఫినిష్ చేయగానే ఈ సినిమా సెట్స్ కి వెళ్లనుంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది. ఈ న్యూస్ తెలియడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎగిరిగంత్తేస్తున్నారు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న సినిమా మొదలవుతుండటంతో సంతోషంగా ఫీలవుతున్నారు. మరి ఈ రేంజ్ అంచనాల మధ్య తెరకెక్కనున్న ఇండియన్ బాక్సాఫీస్ రికార్డ్స్ పై ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.