ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మపై లక్ష్మణ్ ఫైర్…

ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మపై లక్ష్మణ్ ఫైర్…

ఆర్టీసీ విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో మార్పు లేదని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. కార్మిక సంఘాల నేతలు, ప్రతిపక్షాలు కలిసి ప్రభుత్వాన్ని  కూల్చేందుకు కుట్ర చేస్తున్నాయని…  సునీల్ శర్మ అఫిడవిట్ ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలన్నారు. సునీల్ శర్మ దాఖలు చేసిన అఫిడవిట్ కు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు.