
బైరాన్పల్లి అమరవీరుల ఆశయం ఇంకా పూర్తి కాలేదన్నారు ఎంపీ బండి సంజయ్. కేసీఆర్ నీచచరిత్రను సమాధి చేసి నిజమైన చరిత్రను లిఖిస్తామన్నారు. 2024లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగురుతుందని స్పష్టం చేశారు. సిద్దిపేట జిల్లా బైరాన్పల్లికి బీజేపీ నేతలు బండి సంజయ్ స్వామి పరిపూర్ణానంద, రాపోలు ఆనంద భాస్కర్ వెళ్లారు. అక్కడి అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించారు.