ఎంపీగా పోటీ చేయమంటున్నారు.. నాకు ఇంట్రస్ట్ లేదు : రాజాసింగ్

ఎంపీగా పోటీ చేయమంటున్నారు.. నాకు ఇంట్రస్ట్ లేదు : రాజాసింగ్

జహీరాబాద్ ఎంపీగా పోటీ చేయమని పార్టీ అధిష్టానం  తనకు చెప్తోందని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. కానీ తనకు ఎంపీగా పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్ లేదని చెప్పారు. హిందూ రాజ్యం స్థాపన కోసం దేశవ్యాప్తంగా పని చేయాలనుకుంటున్నానని తెలిపారు. శాసనసభ పక్షనేత పదవిపై తనకు ఆసక్తి లేదని చెప్పారు. అసెంబ్లీ ఆవరణలో రాజాసింగ్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఎమ్మెల్యేలలో ఎవరో ఒకర్ని ఫ్లోర్ లీడర్ గా త్వరగా ఎంపిక చేస్తే బావుంటుందని అన్నారు. 

ఫ్లోర్ లీడర్ ప్రకటన ఆలస్యం మంచిది కాదని రాజాసింగ్ చెప్పారు. బీసీ సీఎం నినాదంతో ఎన్నికలకు వెళ్ళాం కాబట్టి.. బీసీ ఎమ్మెల్యేను ఫ్లోర్ లీడర్ గా నియమించాలని జాతీయ నాయకత్వం అనుకుంటోందని తెలిపారు. బండి సంజయ్ కోసం కరీంనగర్ లోకసభ ఎన్నికల్లో ప్రచారం చేస్తానని చెప్పారు.  కిషన్ రెడ్డి పిలిస్తడో లేదో గానీ పిలిస్తే మాత్రం సికింద్రాబాద్ లో కూడా ప్రచారం చేస్తానని రాజాసింగ్ అన్నారు.