కేంద్రం తెచ్చిన పథకాలు తెలంగాణకు వర్తించవా..

కేంద్రం తెచ్చిన పథకాలు తెలంగాణకు వర్తించవా..

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఇచ్చిందేమీ లేదన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటను ఖండిస్తున్నామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. పేదల కోసం కేంద్రం తెచ్చిన పథకాలు.. తెలంగాణకు వర్తించవా అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి సడక్ యోజనతో తెలంగాణకు మేలు జరగలేదా అన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తెలంగాణలో ఎందుకు అమలు చేయటంలేదో చెప్పాలన్నారు లక్ష్మణ్.