సింగరేణిలో సేఫ్టీ లేదు.. ప్రమాదాలకు యాజమాన్య నిర్లక్ష్యమే కారణం

సింగరేణిలో సేఫ్టీ లేదు.. ప్రమాదాలకు యాజమాన్య నిర్లక్ష్యమే కారణం

మంచిర్యాల: శ్రీ రాంపూర్ సింగరేణి SRP 3 గని ప్రమాదంలో మృతి చెందిన కార్మికులు బేర లక్ష్మయ్య, కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. కార్మికుల ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్న వివేక్.. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సింగరేణిలో సేఫ్టీ లేదని.. రక్షణపై యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వివేక్ డిమాండ్ చేశారు. ప్రపంచంలోని కోల్ ప్రొడక్షన్ కంపెనీల్లో ప్రమాదాల శాతం చాలా తక్కువని.. కానీ సింగరేణిలో మాత్రం ఎక్కువన్నారు. కార్మికుల ప్రాణాలు రక్షించాల్సిన బాధ్యత సింగరేణిదేనని స్పష్టం చేశారు.  ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలన్నారు.