సెప్టెంబర్ 17ను రెండు రాష్ట్రాలు జరుపుకుంటున్నాయి: విద్యాసాగర్ రావు

సెప్టెంబర్ 17ను రెండు రాష్ట్రాలు జరుపుకుంటున్నాయి: విద్యాసాగర్ రావు

మహారాష్ట్ర గవర్నర్ గా  సేవలందించిన సి. విద్యాసాగర్ రావు రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. సోమవారం రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో లక్ష్మణ్ చేతులమీదుగా పార్టీ సభ్యత్వం తీసుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనను బీజేపీ ఇంతవాన్ని చేసిందని అన్నారు. మహారాష్ట్రకు గవర్నర్ గా వెళ్లే ముందు… పార్టీకి రాజీనామా చేసిన సందర్భం తనకు ఇప్పటికీ గుర్తని.. అది తన జీవితంలో బాధ కలిగించిన సమయం అని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ కి భవిష్యత్ ఉందని అన్నారు విద్యాసాగర్ రావు.

సెప్టెంబర్ 17ను తెలంగాణ మాత్రమే జరుపుకోవడంలేదని… మహారాష్ట్ర లోని 9 జిల్లాలు, కర్ణాటక లోని 4జిల్లాలు ఘనంగా జరుపుకుంటున్నాయని చెప్పారు విద్యాసాగర్ రావు. తెలంగాణ మాత్రం సెప్టెంబర్ 17ను అధికారికంగా జరుపుకోకపోవడం ప్రజలను ఆలోచింప చేస్తుందని అన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు విద్యాసాగర్ రావు.